26, జనవరి 2011, బుధవారం

ప్రధానికి వచ్చిన మూడో కానుక

" అమ్మవడి " బ్లాగ్ లో అక్క ఆదిలక్ష్మి యడ్ల గారి పోస్ట్ లో రాసిన ప్రధానికి రెండు కానుకలు చదివి వచ్చిన స్ఫూర్తి తో ...

ఒక పార్సెల్ లో సరిహద్దు నుంచి సైనికులు రక్తం తో తడిసిన మట్టి ఉందిట

రెండో పార్సెల్ లో కష్టాల లో ఉన్న రైతు చెమట తో తడిసిన మట్టి ఉందిట ,,

రెండేనా ఇంకో పార్సెల్ కూడా వచ్చింది
అందులో
అధిక ధరల బరువుల మధ్య,
అవినీతి పరుల వల్ల పోయిన పరువుల మధ్య,
అతివృస్టి, అనావృస్టి కరువుల మధ్య,
సామాన్యుడి కన్నీటి చెరువుల తడిసిన మన్ను ఉంది
అందులో....
తొంభై కోట్ల సామాన్యుల వ్యధ ఉంది ఆ మంటి లో
తొంభై కోట్ల సామాన్యుల రోద ఉంది వాళ్ళ కంటి లో .....
అయినా సరే మేరా భారత మహాన్ !!
ఏమైనా సరే హమారా బ్రస్టాచార్ జహా దేఖో వహా హాజిర్ హై !!!


7 కామెంట్‌లు:

  1. నిజమేనండి మూడో కానుక ముచ్చటగానూ, ఆలోచింప చేసేది గానూ ఉంది. చూద్దాం ఎప్పటికి చలనం వస్తుందో! నెనర్లు!

    రిప్లయితొలగించండి
  2. అజ్ఞాత26 జన, 2011 7:20:00 PM

    I think blood of soldiers is not relavent now a days, seems to be first two lines are copied from mid 1980's or post kargil war . but now police blood because of naxals or peoples blood because of terrorists is apt one for the first line i guess

    రిప్లయితొలగించండి
  3. BHARAT:
    gatham......AMAR RAHEGA.
    prasthutham....JAIHO

    mari......
    BHAVISHYATH?

    Hori devuda...

    రిప్లయితొలగించండి
  4. ఒకటండి
    పూర్వంలా అంకిత భావంతో పనిచేసి సైనికాధికారుల సంఖ్య ఇప్పుడు తగ్గింది. అక్కడా అవినీతి రాజ్యమేలుతోంది. ఎందుకంటే, "అవినీతిపరులైన పాలకులకు, దిశా,దశా లేని ప్రజల జీవన విధానానికి మనం కాపలా వుండక్కర్లే"దన్నది వారి భావం. అప్పటికీ, ఇప్పటికీ నష్ట పోతున్నది ఒక విధంగా రైతులే.

    రిప్లయితొలగించండి
  5. అజ్ఞాత29 జన, 2011 12:30:00 PM

    హాల్లో ఎంతో సరదాగా ఉండే మీ పోస్ట్స్ ఈ మధ్య సీరియస్ గా ఉంటున్నాయి
    దారి తప్పాయా..? మీ బ్లాగ్ కి ఫాలోయర్స్ లేరు ఎందుకనీ?
    - తరుణి

    రిప్లయితొలగించండి
  6. నేను చెప్పదలచుకున్న సీరియస్ విషయాలకు హాస్యం ఒక మాధ్యమం మాత్రమే,
    అందుకని నన్ను హస్యకాడు మాత్రమే అనుకో కండి.
    నా పోస్ట్స్ దారి తప్పలేదు
    తప్పు పట్టటానికి ప్రయత్నిస్తున్నాయి, అందుకే అలా సీరియస్ గా కనపడుతున్నాయి
    ఏమైనా నా బ్లాగ్స్ అంత సీరియస్ గా తీస్కున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  7. అజ్ఞాత31 జన, 2011 7:06:00 PM

    Saran, I agree there is substense in your lines,but in which way Govt of India responsible even Agro based up and downs,but what a farmer gets just peanuts,what we pay where it goes?,moderen Indian should prepare for such evenyuality,that is by reducing his size of his family,adopt either boy or girl one,today all govts assure education free,Mr Manmohan cant leave south block and take up farming so let us change our shape of the family.

    రిప్లయితొలగించండి